శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలి

పాలిటెక్నిక్ కళాశాలలను సిల్క్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన శక్తి స్కీం జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. షాద్నగర్ విద్యార్థిసేన ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. సేన అధ్యక్షుడు టీకే శివప్రసాద్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు పాలిటెక్నిక్ విద్యను దూరం చేసే ఈ జీవోను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



