ఫైనల్లో అడుగుపెట్టిన భారత్

ఏషియన్ గేమ్స్ లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్కు చేరింది. బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. నందినీ శర్మ, దీప్తి శర్మ చెరో 3, శ్రీచరణి 2, క్రాంతి, శ్రేయాంక చెరో వికెట్ పడగొట్టారు. ఈనెల 22న ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడనుంది.



