ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!
'ఎవరైనా వచ్చి చేస్తారు' అనుకోలేదు, 'నేనే చేస్తా' అనుకుంది. బెంగళూరులో భారీ వర్షాలతో రోడ్లు గుంతలతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ పెద్ద గుంతను చూసిన మహిళ, సంచుల్లో నిర్మాణ సామగ్రి తీసుకొచ్చి, గుంతలో రాళ్లు పోసి దాన్ని సమం చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు ఆమె చొరవను నెటిజన్లు మెచ్చుకుంటుంటే, మరోవైపు 'ప్రజలే రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది'? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుంతను మాత్రం నింపింది, కానీ లేవనెత్తిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది!

