ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గం.. రైతుల తీర్మానం

AP: ఐదు దశాబ్దాలుగా హామీలకే పరిమితమైన జంఝావతి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన జంఝావతి సాధన సమితి కార్యాచరణ కమిటీ సమావేశంలో ప్రాజెక్టు కోసం గాంధేయ మార్గంలో సాధన దీక్షలు కొనసాగించాలని తీర్మానించారు. రైతులను సమీకరించేందుకు పర్యవేక్షణ, ప్రచార, మీడియా, లీగల్, సాంస్కృతిక తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. త్వరలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటిస్తూ రైతులను చైతన్యపరచాలని నిర్ణయించారు.



