లక్కీ డ్రాతో పేదలకు ఇళ్ల కేటాయింపు: పొంగులేటి

TG: ఇందిరమ్మ టవర్స్ ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గం లక్ష్మీగూడలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లక్కీ డ్రాను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 4.50 లక్షలు, రెండోదశలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో పట్టణ పేదల కోసం లక్ష ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. లబ్ధిదారుల కుటుంబంలోని మహిళ పేరుతో ఇళ్లను రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందన్నారు.



