కృష్ణా జలాలపై CM మౌనం ఎందుకు? : హరీశ్ రావు

TG: వెలిగొండ ప్రాజెక్టు ద్వారా AP ప్రభుత్వం కృష్ణా జలాలను తరలిస్తుంటే CM రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఇది తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహమని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు పెరుగుతుండగా, బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ప్రాజెక్టులకు నీరు లేక ఆయకట్లు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలిస్తోందని ఆరోపించారు.



