BRSలో చేరిన NSUI మాజీ అధ్యక్షుడు

జగిత్యాలలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో మాజీ NSUI అధ్యక్షుడు పుల్ల మహేష్, ఆయన సహచరులు ఓగ్గు రాజిరెడ్డి, పుల్ల గంగాధర్ BRSలో చేరారు. జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే పుల్ల మహేష్ బర్త్డే సందర్భంగా ఆయనకు విష్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కులవృత్తులు, రైతులు, కార్మికుల సంక్షేమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని జీవన్ రెడ్డి అన్నారు.
