PVT స్కూల్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం. ప్రైవేటు పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి మృతి చెందింది. భోజనం తీసుకున్న తర్వాత అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఘటనతో స్కూల్ సిబ్బంది పరారయ్యారు. మృతదేహాన్ని కనిగిరి రోడ్డు వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సింగరాయకొండ సీఐ స్పందించారు. DSP సత్యనారాయణ, DSP నరసింహారావు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిపిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.


