పదేళ్లు దేవరకద్రను నిర్లక్ష్యం చేశారు: మధుసూదన్ రెడ్డి

గత ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్త మండలాలకు బిల్డింగ్లు కట్టలేదని, డిగ్రీ కాలేజ్, హాస్పిటల్స్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మదనపురం హై లెవెల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 1000 రోజుల్లోనే 1,000 రూపాయిల కోట్లకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని డెవలప్ చేశామని తెలిపారు.



