పరకాల కాలేజ్ మైదానంలో సమస్యలు.. పట్టించుకునేవారేరి?

హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల మైదానం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. వర్షం పడితే నీరు నిలిచి బురదమయంగా మారడంతో విద్యార్థులు, వాకింగ్కు వచ్చే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. CM పర్యటన సమయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సీసీ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించకుండా వదిలేయడంతో శిథిలాలు పేరుకుపోయాయి. మైదానాన్ని శుభ్రం చేసి మొర్రం, క్రషర్ డస్ట్తో చదును చేయాలని స్థానికులు కోరుతున్నారు.