బాలీవుడ్ యాక్టర్కు భారీ షాక్.. ఆస్తుల వేలం

బాలీవుడ్ యాక్టర్ రాజ్పాల్ యాదవ్కు ఫైనాన్సియల్, లీగల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.16.61 కోట్ల లోన్ కట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఉన్న ఆయన ఆస్తులను వేలం వేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సెప్టెంబర్ 9న ఆన్లైన్లో ఈ-వేలం నిర్వహించనున్నారు. 'అటా పటా లాపటా' సినిమా కోసం తీసుకున్న లోన్కు భార్య రాధా యాదవ్, తల్లి గోదావరి యాదవ్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టినట్లు అధికారులు తెలిపారు.



