← Back to news

షాక్ ఇవ్వనున్న రీఛార్జ్ ప్లాన్స్

By Anusha· 22h ago
షాక్ ఇవ్వనున్న రీఛార్జ్ ప్లాన్స్

మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలు రానున్న 3–6 నెలల్లో 10–15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. ఇప్పటివరకు టెలికాం కంపెనీలు అఫీషియల్‌గా ధరల పెంపును ప్రకటించలేదు. దీంతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 365 రోజుల వ్యాలిడిటీతో పలు ప్లాన్లను అందిస్తున్నాయి. రూ.1,189 నుంచి రూ.4,999 వరకు ఉన్న ఈ ప్లాన్లలో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు 5G, OTT సబ్‌స్క్రిప్షన్లు లాంటి ప్రయోజనాలున్నాయి. ధరల పెరిగితే ఇయర్లీ ప్లాన్‌తో ముందుగానే రీఛార్జ్ చేసుకోవడం కొంత మేలు.

More in Infotainment