షాద్నగర్లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

TG: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో బాలగోకుల సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేసి ఆకట్టుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ లక్ష్మీనారాయణ చిన్నారులను అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, వేడుకలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.



