గద్వాలను కరువు జిల్లాగా ప్రకటించాలి: CPM

TG: జోగులాంబ గద్వాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు ప్రత్యామ్నాయ పరిరక్షణ చర్యలు చేపట్టాలని CPM రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.శ్రీరామ్ నాయక్ డిమాండ్ చేశారు. గద్వాలలో జరిగిన CPM జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నీటిని సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామని విమర్శించారు. రైతుల భూసమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులను నియంత్రించాలని కోరారు.



