← Back to news

నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలి

By DK· 2h ago
నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండాలి

AP: ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన గొట్టిపడియ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ విజయ సునీత పరిశీలించారు. గ్రామంలో ముంపు పరిస్థితులు, పెరుగుతున్న నీటిమట్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నీటిమట్టం పెరుగుదలపై అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు పరిస్థితుల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

More in Local