అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రసాద్ పథకంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తెలంగాణలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలంపూర్లో ఏర్పాటు చేసిన మల్టీమీడియా సౌండ్, లైట్ షోతో టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి అన్నారు.




