అగ్నిపర్వతం బద్దలు..301 విమానాలకు బ్రేక్

ఇండోనేషియాలోని ఆనక్ క్రకటౌ అగ్నిపర్వతం ఆదివారం ఉదయం 3.53 గంటలకు బద్దలైంది. దాదాపు 30 సెకన్ల పాటు బ్లాస్ట్ అయ్యింది. జకార్తా సహా ఆరు ఎయిర్పోర్టులు మూసేశారు. 58 ఇంటర్నేషనల్ సర్వీసెస్ కలిపి 301 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అగ్నిపర్వతం నుంచి వచ్చిన బూడిద పలు ప్రాంతాల్లో కనిపించింది. అగ్నిపర్వతానికి 3 కిలోమీటర్ల పరిధిలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.



