‘రాళ్లు కరిగే వేళ’ – కథల పుస్తకం

కన్నడ రచయిత, జర్నలిస్టు పి.లంకేశ్ రాసిన ‘కల్లు కరగువ సమయ’ పుస్తకాన్ని రంగనాథ రామచంద్రరావు ‘రాళ్లు కరిగే వేళ’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. కర్ణాటకలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను ఈ కథలు చూపిస్తాయి. ఈ కథల్లోని స్త్రీ క్యారెక్టర్స్ని ఆయన చాలా బలంగా తీర్చిదిద్దారు. సమాజంలో ఉండే మోసాన్ని, మనసులో నలిగే నైతిక పోరాటాలను తట్టుకుంటూ ఆ పాత్రలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఇందులో చూడవచ్చు. పుస్తకం ధర రూ.100. కొనే <a href="https://www.logili.com/books/rallu-karige-vela-p-lankesh/p-7488847-66401946654-cat.html#variant_id=7488847-66401946654">లింక్</a>.



