కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ప్రమాదం
TG: కరీంనగర్ జిల్లాలో బస్సుకు ప్రమాదం తప్పింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. బస్సు బావిలోకి పడకుండా ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని బయటపడ్డారు.



