మేరా యువభారత్ వాలంటీర్ గా గజ్జల దేవేందర్

దుగ్గొండి - నల్లబెల్లి మండలాల మై భారత్ వాలంటీర్ గా దుగ్గొండి మండలానికి చెందిన గజ్జల దేవేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామక పత్రాన్ని జిల్లా యూత్ ఆఫీసర్ సంజీవ్ అందజేశారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలో సాగస్వామ్యులను చేసేందుకు ఆయన యూత్ వాలంటీర్ గా సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అరుదైన అవకాశాన్ని సమర్థవంతంగా నిర్వహించి యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి కృషిచేస్తానన్నారు.



