కార్మికుల ధర్నా.. సర్కారు ఆసుపత్రి ఎదుట!

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట మంగళవారం కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికులు ధర్నా చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, తమ శ్రమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. TUCIA సత్తుపల్లి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో జిల్లా కోశాధికారి అమర్లపూడి, శరత్ మాట్లాడుతూ, కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 6న ఖమ్మం నగరంలోని రామనర్సయ్య భవనంలో TUCIA రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయని, అందులో కార్మిక సమస్యలపై పోరాట రూపకల్పన చేస్తామన్నారు.



