అక్షర స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్

TG: వరంగల్ జిల్లా నర్సంపేటలోని బాలాజీ విద్యాసంస్థలకు చెందిన అక్షర ది స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేయగా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది.



