బలవంతపు మతమార్పిడి కేసు..నిర్దోషిగా తేలిన యువకుడు

మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లా పిపారియాకు చెందిన సయ్యద్ ఖాన్ బలవంతపు మతమార్పిడి ఆరోపణలపై ఏడాదిన్నర పాటు జైలుశిక్ష అనుభవించాడు. చివరకు నిర్దోషిగా బయటపడ్డాడు. సయ్యద్ ఖాన్, ఓ హిందూ యువతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2025 ఫిబ్రవరి 7న ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకోవాలని వెళ్లారు. అక్కడే కొందరు వారిపై దాడి చేశారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడనే కంప్లైంట్తో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో యువతి నిజం చెప్పడంతో ఖాన్ను నిర్దోషిగా ప్రకటించారు.



