మలేషియా PM నోట హిందీ పాట
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం బాలీవుడ్ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఢిల్లీలో జరిగిన BRICS గాలా డిన్నర్లో ఆయన గాయకుడు కిషోర్ కుమార్ పాటను పాడారు. "ఖ్వాబ్ హో తుమ్ యా కోయీ హకీకత్” అంటూ ఆయన పాడిన పాట SMలో వైరల్ అయింది . ఈ పాట 1965లో విడుదలైన ‘Teen Devian’ సినిమాలోనిది. భారతీయ సినిమాలు, సంగీతంపై తనకున్న అభిమానాన్ని అన్వర్ ఇబ్రహీం మరోసారి చాటుకున్నారు.



