ధర్నా చౌక్ లో టెట్ సమస్యలపై నిరాహార దీక్ష..! 4వ రోజు

విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. టెట్ సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 నుంచి నిరాహార దీక్షలు మొదలయ్యాయి. సీఐటీయూ ఈ దీక్షలకు మద్దతు ప్రకటించింది. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎ.వి. నాగేశ్వరరావు దీక్షలను ప్రారంభించారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.





