← Back to news

ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్

By డీకే· 5 Jul 2026· ఖమ్మం జిల్లా
ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో స్టూడెంట్ మిస్సింగ్

TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో మైనర్ విద్యార్థిని మిస్సింగ్ ఘటన విద్యార్థుల భద్రతపై ఆందోళనకు దారితీసింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాకపోవడంతో అధికారులు పాఠశాలలో విస్తృతంగా విచారణ నిర్వహించారు. విద్యార్థులను పంపించే విషయంలో పాటించాల్సిన నిబంధనలను అమలు చేయకపోవడం, పర్యవేక్షణ లోపమే ఈ ఘటనకు కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు విద్యార్థిని ఆచూకీ గుర్తించి భరోసా కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More in Local