తెలుగువారి కోసం దిల్లీలో కొత్త రైస్ స్టోర్ ఓపెన్

AP: దిల్లీలో పర్యటించిన ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక, సమావేశాల్లో పాల్గొన్నారు. NCCF ఎండీని కలిసి నిత్యావసరాల సప్లై, ధరల కంట్రోల్పై చర్చించారు. తర్వాత కేంద్ర కన్జ్యూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి ఖరేను కలిశారు. దిల్లీ AP భవన్లో కొత్త రైస్ స్టోర్ను లాంచ్ చేశారు. తెలుగువారికి మంచి క్వాలిటీ బియ్యం అందించడమే లక్ష్యమన్నారు. రేపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పామ్ ఆయిల్, ఉల్లిపాయలు, పప్పుల ధరలపై చర్చిస్తామని చెప్పారు. సివిల్ సప్లై శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.



