SIపై 40 వేల లంచం ఆరోపణలు

వరంగల్ సబ్డివిజన్కు చెందిన SIపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎంక్వైరీ జరపాలని వరంగల్కి చెందిన ఓ వ్యక్తి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎం రేవంత్రెడ్డి, DGP సీవీ ఆనంద్ల దృష్టికి తీసుకెళ్లారు. గంజాయి కేసులో నిందితులను రీహ్యాబిలిటేషన్ సెంటర్కు పంపకుండా ఉండటానికి SI 40 వేలు లంచం తీసుకున్నారని ఆరోపించారు. అలాగే ఒక హోంగార్డ్, హెడ్కానిస్టేబుల్ కూడా యాక్సిడెంట్ కేసుల్లో డబ్బులు తీసుకున్నారని, వారిపై కూడా విచారణ జరపాలని కోరారు.