← Back to news

ఆస్పత్రిలో సౌకర్యాల కొరత.. రోగుల అవస్థలు

By Thukaram Anumula· 2d ago

TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సౌకర్యాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ అధ్యక్షుడు అనుముల తుకారం ఆరోపించారు. ముఖ్యంగా గర్భిణీ మహిళలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నా, కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేవని అన్నారు. పేషెంట్ల చిట్టీలు రాసే విషయంలో పరిచయాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local