తిరుపతి కొండను కాలినడకన ఎక్కిన 116 ఏళ్ల బామ్మ !

తిరుమల అలిపిరి మెట్లను కాలి నడకన ఓ 116 ఏళ్ల బామ్మ ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుపతికి చెందిన నవనీతమ్మ అనే 116 ఏళ్ల వృ ద్ధురాలు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన మెట్లెక్కి కొండపైకి చేరుకుంది. వృద్థురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టీటీడీ బోర్డు ఛైర్మన్ ఆమె గురించి ఆరా తీశారు. ఆమె తమిళనాడుకు చెందిన మహిళ అని తిరుపతిలో బంధువుల దగ్గర ఉంటోందని తెలిసింది. ఆమె భక్తికి, ఓపికకు ఆశ్చర్యపోయిన టీటీడీ బోర్డు ఛైర్మన్ ఆమెకు, ఆమె కుటుంబానికి సోమవారం విఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు.



