కూలిన ఇంటి పైకప్పు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 ఏళ్ల వ్యక్తి పెద్ద గాయాలై ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులీ వార్డులో ఈరోజు ఉదయం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జాగినట్లు పోలీసులు వెల్లడించారు.



