10 వేల మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

విజయవాడ, నెల్లూరు జిల్లాలో వినాయక చవితి సందడి మొదలైంది. ‘మట్టి గణపతే మహా గణపతి’ అనే నినాదంతో , ఇందిరాఫుడ్స్, మండవాస్ సంస్థలు కలిసి 10 వేల మట్టి విగ్రహాలను ఆటోలు, ఎడ్ల బండ్లపై తెచ్చి ఉచితంగా పంపిణీ చేశాయి. ప్రజల్లో మట్టి విగ్రహాలపై మార్పు వచ్చిందని మండవ వెంకటరత్నం తెలిపారు. ప్రతీ ఏటా విగ్రహంతో పాటు పూజ పత్రిని ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.