నర్సు మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

హైదరాబాద్ లో నర్సును దారుణంగా హత్య పైన పెద్ద ఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడు సనాఉల్లాను కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం ఆదివాసీ JAC కమిటీతో పాటు తిమ్మంపేట JAC నాయకులు డిమాండ్ చేశారు. యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరిపి నిజానిజాలను వెలికితీయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. బీహార్ వ్యక్తి సనావుల్లా ఆగస్ట్ 28న నర్సు రూంలోకి వెళ్లి రేప్ అటెమ్ట్ చేసి, హత్య చేశాడు.



