యూరియా వచ్చేసింది.. ఆన్లైన్లో బుక్ చేసుకోండి!

వేంసూరు రైతులకు గుడ్ న్యూస్! లచ్చన్నగూడెం, భరణిపాడు, దుద్దేపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, మర్లపాడు గ్రోమోర్ సెంటర్లో యూరియా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయం మండల వ్యవసాయశాఖ అధికారి పచ్చల రామ్మోహన్ రావు చెప్పారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. యాప్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే తమకు తెలపాలని చెప్పారు.



