← Back to news

రుద్రూర్‌లో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

By Abhishek· 1d ago· Rudrur, Rudrur, Nizamabad
రుద్రూర్‌లో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో ఆయన ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు, భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ద్వారా చెరువులు, నీటి వనరులు కాలుష్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చని నాయకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

More in Local