కామారెడ్డిలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్టీవోస్ కాలనీ ప్రసన్నాంజనేయ ఆలయంలో 200 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పీఓపీ, రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల జలాశయాలు కలుషితమవుతున్నాయని కౌన్సిలర్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని ఆమె కోరారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు.