వినాయక చవితి, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
AP: వినాయక చవితి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకే సమయంలో జరుగుతున్నాయని, ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది వినాయక చవితి కార్యక్రమాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానుండగా, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయని చెప్పారు. సెప్టెంబర్ 15న సీఎం తిరుపతికి రానున్నారని, బందోబస్తు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.



