రింతాడ సమస్యలపై ‘మీకోసం’లో వినతి

AP : అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామంలోని సమస్యలు పరిష్కరించాలని మాజీ ఉపసర్పంచ్ మడపల సోమేశ్ కుమార్ ‘మీకోసం’ కార్యక్రమంలో MPDOకు వినతిపత్రం ఇచ్చారు. స్కూల్ దగ్గర జాతీయ రహదారిపై స్కూల్ జోన్ బోర్డు, జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జాతీయ రహదారి వల్ల దెబ్బతిన్న స్మశానవాటికను పునరుద్ధరించాలని, PMAY ఇళ్ల పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.



