భూమిపూజై 2 ఏళ్లు.. రోడ్డు పని Start కాలేదు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రోడ్డు నిర్మాణం పేరుకే పరిమితమైంది. మంత్రి పొన్నం, ప్రభాకర్ శంకుస్థాపన చేసి రెండేళ్లయినా అధికారులు పని మొదలుపెట్టలేదు. ఈ నిర్లక్ష్యంతో సర్పంచ్ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా రోడ్డెక్కి ధర్నా చేశారు. మహిళలు రోడ్డుపై నాట్లు వేస్తూ, "రోడ్డు లేక మా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి" అంటూ నిరసన తెలిపారు. భీమదేవరపల్లి నుంచి వంగర వరకు ఈ రోడ్డు చాలా అవసరమని, వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఇష్యూపై కలెక్టర్ స్పందించకపోతే, ప్రజల ఆందోళన మరింత పెరుగనుంది.



