హసన్పర్తి మహిళ దారుణ హత్య

హన్మకొండ జిల్లా హసన్పర్తిలో మిస్సయిన తౌటం స్వప్న (40) హత్య కేసును పోలీసులు సాల్వ్ చేశారు. కర్ణాటకకు చెందిన కారు డ్రైవర్ బసవరాజ్కి ఈమెతో పరిచయం ఉండటంతో, మ్యారేజ్ చేసుకోవాలని స్వప్న ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను బళ్లారికి రప్పించి, ఆలయం దగ్గర హత్య చేశాడు. బాడీని ముక్కలు చేసి అడవిలో పడేసి, బట్టలు తగులబెట్టాడు. బసవరాజ్ను పట్టుకుని విచారించగా తప్పు ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.