ఓటు మీ హక్కు.. ఈ అవకాశం వదలొద్దు..

నాగర్కర్నూల్ జిల్లా ఓటర్లకు గుడ్ న్యూస్.. కలెక్టర్ హేమంత, కేశవ్ పాటిల్ సెప్టెంబర్ 5,6,12,13 తేదీల్లో ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహిస్తున్నారు. కొత్త ఓటర్ల నమోదు, పేరు మార్పులు, చేర్పులు, తొలగింపులు కావాల్సినవారు వెంటనే మీ BLO ను కలవండి. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు మాత్రం ధ్రువపత్రాలతో హియరింగ్ కు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో 1 లక్ష నోటీసులు జారీ అయ్యాయి. ఈ స్పెషల్ డేస్ మిస్ అయితే, మళ్ళీ అవకాశం కష్టమే! ఓటు మీ రాజ్యాంగ హక్కు, దాన్ని వినియోగించుకోవడం మీ బాధ్యత.



