రీయింబర్స్మెంట్ బకాయిలు.. మీరే ఇవ్వాలి CM సారూ!
TG: సిద్ధిపేటలోని శ్రీకృప ఫార్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్ ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధను వీడియో ద్వారా తెలిపారు. ఫీజులు చెల్లించకపోవడంతో 30 మందిక సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం ఇవ్వడం లేదని సీఎం రేవంత్రెడ్డి ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. తమకు సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు. ఈ పోస్ట్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు.



