ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుదుపులు.. మినిస్టర్ రామ్మోహన్ వివరణ

ఫుకెట్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మంగళవారం పెద్ద గాలుల కారణంగా కుదుపుల (టర్బులెన్స్)కు గురైంది. ఈ ఘటన ఐదు నిమిషాల పాటు కొనసాగినట్లు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనలో క్యాబిన్ స్టాఫ్కు వెన్నెముక, మెడ భాగాల్లో ఇంజరీ అయ్యిందని వెల్లడించారు. ప్రయాణ మధ్యలో ఫ్లైట్ సుమారు 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కోల్పోయినప్పటికీ, 137 మంది ప్రయాణికులు, 8 మంది స్టాఫ్తో ఎయిర్ ఇండియా AI2379 ఫ్లైట్ ఉదయం 11.07 గంటలకు దిల్లీ ఎయిర్ పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయ్యిందన్నారు.



