మాంసాహారం వల్ల ఈ ఊరు వినాయక చవితికి దూరం

అనంతపురం జిల్లా శేట్టూరు మండలం బసంపల్లిలో విచిత్రం ఆచారం కొనసాగుతోంది. మిగతా వాళ్లంతా వినాయక చవితి పండుగ జరుపుకునే టైంలో ఈ గ్రామం మదేవత మారెమ్మ ఉత్సవాలు జరుపుతుంది. మారెమ్మ ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏటా వినాయక చవితికి ఒకటి, రెండు రోజులు ముందే ఈ ఉత్సవాలు మొదలవుతాయి. గ్రామస్థులు బంధుమిత్రులతో కలిసి మాంసాహారం వండుకుంటారు. కాబట్టి గణపతి పూజ చెయ్యడం అపవిత్రం అని భావిస్తారు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో బసంపల్లి గ్రామం వినాయక చవితికి దూరంగా ఉంటుంది. మీ ఊర్లో ఇలాంటి విశేషాలుంటే Clearcut Newsకి పంపండి.