అవేల్తిలో పెద్దపులి సంచారం.. ఆవులపై దాడి

AP: కాకినాడ జిల్లా శంఖవరం మండలం అవేల్తి గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మేతకు వెళ్లిన గోము ధర్మరాజుకు చెందిన రెండు ఆవులపై పులి దాడి చేయగా ఒక ఆవు మృతి చెందింది. మరో ఆవు గాయపడింది. దీంతో అవేల్తి, ఒండ్రేగుల, అనుమర్తి, పెదమల్లాపురం గ్రామాల ప్రజలను రెవెన్యూ, అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవి ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, పశువులను మేతకు అడవిలోకి పంపవద్దని సూచించారు. సంచారం సమాచారాన్ని అందించారు.