CM రేవంత్ రెడ్డితో సింగపూర్ ప్రతినిధుల భేటీ

TG: CM రేవంత్ రెడ్డితో సింగపూర్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సెమీకండక్టర్ పరిశ్రమలపై వారు ఆసక్తి కనబరిచారు. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ను నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిని తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. సమావేశంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చాయి.



