అమరజీవికి ఘన నివాళి! 28వ వర్ధంతి వేడుక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం నాయుడుపేటలో అమరజీవి కామ్రేడ్ దొండపాటి, వెంకట సుబ్బారావు 28వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సీపీఎం శాఖ కార్యదర్శి చెనుబోయిన, బ్రహ్మయ్య అధ్యక్షతన సభ జరిగింది. ఆయన స్మారక స్థూపం వద్ద సీపీఎం మండల కార్యదర్శి మోరంపూడి, శ్రీనివాసరావు పార్టీ జెండా ఎగురవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఆయన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మి రైతులు, కార్మికుల కోసం పోరాడారని గుర్తు చేశారు.



