ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని వినతి

TG: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ధర్మ సమాజ్ పార్టీ, బీసీ-ఎస్సీ-ఎస్టీ జేఏసీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తెలంగాణలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ మల్యాల MRO శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు తెలిపారు.



