వన్యప్రాణుల రక్షణకు ‘హనుమాన్’.. పవన్ కల్యాణ్

AP: ఏనుగుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన International Elephant Day ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతో ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయన్నారు. మానవ–వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రతి సంవత్సరం రెండు కుంకీ ఏనుగులకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్లాన్ సిద్ధం చేశామని అన్నారు. ‘హనుమాన్’ ప్రాజెక్టుతో వన్యప్రాణుల ప్రొటెక్షన్కు వేగంగా పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.



