బాంసేఫ్ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ..!

కామారెడ్డిలో బాంసేఫ్ తెలంగాణ 13వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను డీఎస్పీ మధుసూదన్ ఆవిష్కరించారు. ఈ మహాసభ సెప్టెంబర్ 20న జగిత్యాల పొన్నాల గార్డెన్స్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఓబీసీ సెన్సస్, ఈవీఎంలు, అడివాసి, జీవో 25 తదితర అంశాలపై చర్చిస్తారు. బాంసేఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ సంఘం నేతలు, బీసీ సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్, బీఎంఎం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.

